బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌పై హైదరాబాద్‌లో కేసు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 18 May 2020

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌పై హైదరాబాద్‌లో కేసు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విశాల్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని ఆరోపిస్తూ బాలాజీ టెలీఫిల్మ్స్‌ అధినేత్రి ఏక్తా కపూర్‌పై సైబర్‌ క్రైం విభాగానికి చేసిన ఫిర్యాదులో విశాల్ పేర్కొన్నారు. ఏక్తా కపూర్‌ రూపొందించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌-2 వెబ్‌ సీరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సీరీస్‌లోని 'ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్‌' ఎపిసోడ్‌లో ఒక వ్యక్తికి ఆర్మీ దుస్తులను తొడిగి అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలున్నాయి.ఫేస్ బుక్ పేజ్ లో వెబ్ సిరీస్ కు చెందిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన విశాల్ కుమార్... ఓ ఆర్మీ అధికారి భార్యకు, వేరే వ్యక్తికి ఉన్న సంబంధాలను ఇందులో చూపించారని పేర్కొన్నారు. ఏక్తా కపూర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత ఏక్తా కపూర్ కు నోటీసులు పంపుతామని పోలీసులు తెలిపారు. ఏక్తాకపూర్ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. డైరెక్టర్ కూడా. ఈమె వయసు 44ఏళ్లు. 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలిఫిలీంస్‌కు ఆమె క్రియేటివ్ హెడ్‌గా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఏక్తా కపూర్ చేస్తున్న సేవలకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కరంతో సత్కరించింది.


from https://ift.tt/2ZeNeUv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages