యంగ్ రెబల్ స్టార్ సినిమాలో మరోసారి నటించబోతున్నారని తెలుస్తోంది. గతంలో ‘బాహుబలి’ సిరీస్లో ప్రభాస్తో ఢీకొట్టి దేశవ్యాప్త క్రేజ్ సంపాదించిన రానా.. మరోసారి అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారట. ప్రభాస్ 21వ సినిమాగా దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ కోసం రానాను సంప్రదించారని సమాచారం. నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ విన్న భల్లాలదేవుడు ప్రభాస్తో ఫైట్ చేసేందుకు రెడీ అనేసినట్లు లేటెస్ట్ టాక్. ఇటీవలే తాను ఇంట్లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసిన రానా.. ఈ పిక్ నాగ్ అశ్విన్ తీసిందని పేర్కొన్నారు. అలాగే నాగ్ అశ్విన్ సైతం నిర్మాత సురేష్ బాబుతో చర్చిస్తూ సినిమా థియేటర్లకు మునుపటి కళ రావడం ఎలా? జనాన్ని థియేటర్స్కి రప్పించేందుకు ఎలా ప్లాన్ చేయాలి? అనే అంశంపై డిస్కస్ చేశానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో నాగ్ అశ్విన్ సినిమాలో రానా రోల్ కన్ఫర్మ్ చేశారు కాబట్టే, ఆయన సురేష్ బాబు ఇంటికి వెళ్లారనే టాక్ ముదిరింది. ఈ క్రమంలోనే తాజాగా.. సురేష్ బాబుని కలిసిన నాగ్ అశ్విన్ రానాతో ప్రభాస్ 21 కథను షేర్ చేసుకున్నారని, విలన్గా ఆయననే ఫైనల్ చేశారనే విషయం బయటకొచ్చింది. Also Read: ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఫినిష్ కాగానే.. నాగ్ అశ్విన్ మూవీ సెట్స్ మీదకు రానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందించనున్న ఈ సినిమాతో గత రికార్డులను తిరగరాయాలి ప్లాన్ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిత్ర నటీనటులు మొదలుకొని, నిర్మాణ విలువల వరకు ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యారట. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఆద్యంతం ఆసక్తికర కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో భారీ హంగులతో ఈ మూవీ రూపొందనుంది. సో.. ఇందులో ప్రభాస్తో రానా ఢీ కొట్టడమంటే అంతకన్నా ఆసక్తికర విషయం ఇంకోటి ఉండదు. చూద్దాం మరి చివరకు ఏం జరుగుతుందో!.
from https://ift.tt/3fPlRpY
No comments:
Post a Comment