ఒకవైపు లాక్ డౌన్.. మరోవైపు వరుస మరణాలు సినిమా ఇండస్ట్రీని కలిచివేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు రషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, కుల్మీత్ మక్కర్లు స్వల్ప వ్యవధిలో మరణించగా.. మలయాళ యంగ్ హీరో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పోవెల్లియుమ్ కుంజిదమ్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. బేసిల్ జార్జ్ వయసు 30 ఏళ్లు కాగా.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో గుర్తింపుతెచ్చుకుంటున్న ఈ యువ నటుడి దుర్మరణం మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి తన మిత్రులతో కలిసి కొలెంచెర్రీ నుంచి మువత్తపుజా వెళ్తుండగా.. మువత్తపుజాకి కొంత దూరంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్తో కలిసి మొత్తం ఐదుగురు ఈ కారులో ప్రయాణిస్తుండగా.. అతివేగంతో రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి కారు దూసుకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బేసిల్ జార్జ్ (30) పాటు, నిధిన్ (35), అశ్విన్ జాయ్ (29) అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న లతీష్, సాగర్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఇంటిలో ఉన్న వలస కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.
from https://ift.tt/3b30qy5
No comments:
Post a Comment