ఈసారి మీ విజన్ ఫెయిలైంది: మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 6 April 2020

ఈసారి మీ విజన్ ఫెయిలైంది: మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖ

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సినీనటుడు, మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ మండిపడ్డారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు, అణగారిన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. డీమానిటైజేషన్ మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోదీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో కూడా పేదలే నష్టపోయారని గుర్తుచేశారు. దీని ప్రభావం దేశ జీడీపీ మీద పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ప్రధానికి ఆయన భారీ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఈ దేశంలో భయపడుతూ బతుకుతోన్న ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ లేఖను రాస్తున్నాను. మన సమాజంలోని అణగారిన వర్గాలు, పేదలపై ప్రభుత్వం అశ్రద్ధ వహించకూడదని నేను మార్చి 23న మీకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాను. ఆ తరవాత రోజే ఇంచుమించుగా డీమానిటైజేషన్ తరహాలో తక్షణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. సరే నాకు తెలీదేమో అనుకొని నేను ఎన్నుకొన్న నాయకుడైన మీపై నమ్మకం ఉంచాను. మీరు డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు కూడా మీరు చేసింది కరెక్ట్ అని నమ్మాను. కానీ, అప్పుడు నేను అలా నమ్మడం తప్పు అని తెలిసింది. ఇప్పుడు మీరు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాలం నిరూపించింది సార్’’ అని కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘జాతి ఎంపిక చేసుకున్న నాయకుడు మీరు’’ అంటూనే మోదీపై విమర్శలు చేశారు కమల్. ‘‘ఈ క్లిష్ట సమయంలో 140 కోట్ల భారతీయులు మీ దిశానిర్దేశాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి మాస్ ఫాలోయింగ్ బహుశా ప్రపంచంలో ఏ ఇతర నాయకుడికి లేదు. మీరు ఏం చెబితే వారు అది చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మన కోసం నిస్వార్థంగా, అలుపెరగకుండా పనిచేస్తోన్న వైద్య సిబ్బందికి మద్దతుగా మీరు ఇచ్చిన పిలుపునకు మీ ప్రత్యర్థులు కూడా చప్పట్లు కొట్టారు. మేం మీ విన్నపాలను, ఆదేశాలను పాటిస్తాం. కానీ, ఈ నిర్ణయాలు ప్రజలను గందరగోళంలో పడేయకూడదు. నా ప్రజలకు నేను ఒక నాయకుడిగా ఉన్నాను కాబట్టి మీ ఆలోచనలను ప్రశ్నించమని నా మనసు నాకు చెబుతోంది. నేను మిమ్మల్ని ఏమైనా అమర్యాదపరిచి ఉంటే దయచేసి క్షమించండి’’ అని కమల్ లేఖలో పేర్కొ్న్నారు. అలాగే, ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ బల్బులను ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లు వెలిగించి కరోనా చీకట్లను తరిమి కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేశ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, దీనిపై కూడా కమల్ హాసన్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ప్రధాని పిలుపు మేరకు గొప్పవాళ్లు బాల్కనీల్లో నూనె దీపాలు వెలిగించారని.. అయితే, పేద ప్రజలు రొట్టెలు కాల్చుకోవడానికి కావాల్సిన నూనె కోసం ఇబ్బంది పడుతున్నారని కమల్ వెల్లడించారు. గతంలో జాతిని ఉద్దేశించి మోదీ రెండు సార్లు మాట్లాడటం కచ్చితంగా అవసరమేనని.. కానీ, దాని కన్నా ముఖ్యమైన పని పేదలను ఆదుకోవడమని అన్నారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో మోదీ విజన్ ఫెయిలైందని ఘాటుగా విమర్శించారు.


from https://ift.tt/3dRQoT4

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages