వారికి శిర‌స్సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా: బోయ‌పాటి శ్రీ‌ను - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

వారికి శిర‌స్సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా: బోయ‌పాటి శ్రీ‌ను

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరో 19 రోజులపాటు ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో సినీ ప్రముఖులు మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిస్తున్నారు. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను సైతం 19 రోజులపాటు ప్రజలు ఈ లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘లాక్‌డౌన్ కాలాన్ని మే 3 వ‌ర‌కు పొడిగిస్తూ మ‌న ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీగారు తీసుకున్న నిర్ణయం ఎంతైనా స‌ముచితం. కోవిడ్‌-19పై రాజీలేని పోరాటాన్ని కొన‌సాగించ‌డానికి లాక్‌డౌన్ మించిన ఆయుధం లేద‌నేది నిపుణులంతా చెప్తున్న విష‌యం. ఇప్పటివ‌ర‌కు 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశంలోని అంద‌రం ఏక‌తాటిపై నిల్చొని విజ‌య‌వంతం చేశాం. అందువ‌ల్లే క‌రోనా వైర‌స్ స‌మాజంలో విరివిగా వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోగ‌లిగాం. ఈ రోజు నుంచి మ‌రో 19 రోజుల పాటు అదే స్ఫూర్తితో, స్వీయ నియంత్రణ‌తో లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేసి, త‌ద్వారా కరోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలోనూ విజ‌యం సాధించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప‌నిచేస్తున్నాయి. అహ‌ర్నిశం అప్రమ‌త్తంగా ఉంటూ, ఎప్పటిక‌ప్పుడు ప్రజ‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ చైత‌న్య ప‌రుస్తున్న ప్రభుత్వ యంత్రాంగాల‌కు చేతులెత్తి న‌మ‌స్కరిస్తున్నాను. క‌రోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్టప‌డుతున్న తీరుకు శిర‌స్సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా. మ‌న దేశం ఇంత ప్రభావ‌వంతంగా క‌రోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న సేవ‌లే ప్రధాన కార‌ణం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా త‌మ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా దేశానికి ఆర్థికంగా తీవ్ర న‌ష్టం వాటిల్లినా, దాని కంటే ప్రజ‌ల ప్రాణాలే గొప్పవ‌ని ప్రధాని చెప్పిన మాట‌లు ఎంతో విలువైన‌వి. సినిమా ఇండ‌స్ట్రీపై కూడా లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం క‌లిగిస్తోంది. ప్రధానంగా ఉపాధి కోల్పోయిన‌ పేద క‌ళాకారులు, దిన‌స‌రి వేత‌నంతో జీవించే కార్మికులను ఆదుకోవ‌డానికి సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఒక్కటిగా ముందుకు రావ‌డం ముదావ‌హం. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌క‌మైన‌దైనా, దాని వ‌ల్ల దేశ‌మంతా ఒక్కటేన‌నే భావ‌న ఏర్పడ‌టం, కుల మ‌త భేదం లేకుండా, పేద ధ‌నిక తార‌త‌మ్యం లేకుండా అంద‌రం ఐక‌మ‌త్యం ప్రద‌ర్శించ‌డం గొప్ప విష‌యం. ఇదే స్ఫూర్తితో మే 3 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేద్దాం. అంద‌రం ఇళ్లల్లో ఉండి ప్రభుత్వాల‌కు, పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రిద్దాం. ఇంట్లో ఉందాం, క్షేమంగా ఉందాం’’ అని తన పోస్ట్‌లో బోయపాటి పేర్కొన్నారు.


from https://ift.tt/2VdOuVP

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages