సినీకార్మికులకు మహేష్ బాబు సోదరి విరాళం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

సినీకార్మికులకు మహేష్ బాబు సోదరి విరాళం

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, ఎంపీ గల్లా జయదేవ్ భార్య పద్మావతి గల్లా.. సినీ కార్మికుల సహాయార్థం కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం అందజేశారు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై జయదేవ్ దంపతులు కుమారుడు అశోక్ గ‌ల్లాను హీరోగా ప‌రిచ‌యం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా అమరరాజా ఇండస్ట్రీస్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సినిమాలను నిర్మిస్తామని పద్మావతి గతంలో చెప్పారు. కాగా, ఇప్పుడు ఛారిటీకి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేయ‌లేని స్థితిలో ఉన్న పేద సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఎంతోమంది సినీ పెద్దలు ముందుకు రావ‌డం శుభ ప‌రిణామ‌ం. ఆ మంచి ప‌నిలో భాగం కావాల‌నే ఉద్దేశంతో సీసీసీకి త‌మ వంతుగా రూ. 10 ల‌క్షలు అంద‌జేస్తున్నాం. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో అంద‌రూ స‌మ‌ష్టిగా కృషి చేయాలి. త‌మ త‌మ ఇళ్లల్లో ఉండ‌టం ద్వారా క్షేమంగా ఉండాలి. అశోక్ గ‌ల్లాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మేం నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోయింది. ప‌రిస్థితులు చ‌క్కబ‌డ్డాక షూటింగ్ కొన‌సాగిస్తాం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) తరఫున 25 లక్షల రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఎఫ్ఎన్‌సీసీ తరఫున ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కె.ఎస్.రామారావు తదితరులు చెక్‌ను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా చాలా మంది హీరోలు విరాళాలు అందజేశారు. అలాగే నిర్మాతలు, దర్శకులు కూడా విరాళాలు ఇచ్చారు.


from https://ift.tt/2Xg1Cel

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages