రానాకు కిడ్నీ దానం చేసిన తల్లి.. నిజం చెప్పిన దగ్గుబాటివారబ్బాయి! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 24 July 2019

రానాకు కిడ్నీ దానం చేసిన తల్లి.. నిజం చెప్పిన దగ్గుబాటివారబ్బాయి!

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గత కొద్ది రోజులుగా విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న రానా.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసమే వెళ్లారని అన్నారు. అయితే, తాజాగా ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందనే వార్త బలంగా వినిపిస్తోంది. రానాతో పాటు ఆయన తల్లి లక్ష్మి, చెల్లెలు మాళవిక యూఎస్‌లోనే ఉన్నారట. కుమారుడికి కిడ్నీ దానం చేయడానికి లక్ష్మి వెళ్లారని, రానాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని పలు ఫిల్మ్ న్యూస్ వెబ్‌సైట్లు రాశాయి. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే రానాకు కిడ్నీ సమస్య తలెత్తిందట. ‘బాహుబలి’ కోసం కఠినమైన కసరత్తులు చేయడంతో రానా శరీరంలోని సోడియం లెవెల్స్ పడిపోయానని అంటున్నారు. అప్పట్లో ఆయన హైదరాబాద్, ఆ తరవాత ముంబైలోని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకున్నారని సమాచారం. కానీ, కిడ్నీ సమస్య నయం కాకపోవడంతో మార్పిడి ఒక్కటే పరిష్కారమని డాక్టర్లు సూచించారట. దీంతో ఆయన యూఎస్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రానా కొట్టిపారేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రానా బదులిచ్చారు. ‘డియర్ కామ్రేడ్’ విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ రానా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సినిమాను తాను యూఎస్‌లో చూస్తానని కూడా చెప్పారు. ఈ పోస్ట్‌లో ఒక అభిమాని కిడ్నీ సర్జరీ గురించి ప్రశ్నించారు. ‘సర్జరీ అంటున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడిగారు. దీనికి రానా సమాధానం ఇస్తూ.. ‘అలాంటి వార్తలు చదవడం మానేయండి’ అని రిప్లై ఇచ్చారు. అంటే, ఈ వార్తల్లో నిజం లేదనేగా అర్థం. రానా, ఈ విధంగా సమాధానం ఇచ్చినా ప్రస్తుతం వస్తోన్న వార్తలను చూసి ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.


from https://ift.tt/2y7tN1b

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages