కరోనాపై ప్లకార్డులతో మెగా ఫ్యామిలీ మెసేజ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 14 April 2020

కరోనాపై ప్లకార్డులతో మెగా ఫ్యామిలీ మెసేజ్

పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు సినీ తారలు. మన తెలుగు తారలంతా ఈ విషయంలో ఎంతో చురుకుగా ఉన్నారు. నుంచి సీరియల్ ఆర్టిస్టుల వరకు అంతా కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు అభిమానులకు మెసేజ్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ ... తన ఫ్యామిలీతో కలిసి కరోనా వైరస్ పై ఓ సందేశం ఇచ్చారు. ‘ ఇంట్లో యుద్ధం చేద్దాం. క్రిమిని కాదు ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా కరోనాను తరిమేద్దాం. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం’ అంటూ ప్లకార్డులతో కుటుంబసభ్యులంతా ఫోటోలు దిగి స్టే హోమ్ అంటూ ఓ మెసేజ్ ఇచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కనిపించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో.... చిరంజీవి, అల్లు అరవింద్ , నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్, చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం. ‘మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉందాం. మనతో పాటు... మన ప్రియమైనవారిని, ఈ ప్రపంచాన్ని రక్షిద్దాం’ అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే టాలీవుడ్‌ ఓ సాంగ్ కూడా విడుదల చేసింది. సంగీత దర్శకుడు కోటి ఓ ప్రత్యేక గీతాన్ని ట్యూన్‌ చేయగా.. మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఆలపించారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ... వైరస్‌ నిర్మూలనకు చేయాల్సిన కృషిని పాట రూపంలో రూపొందించారు. ఎవరి ఇంటిలో వారు ఉంటూ పాట పాడి రికార్డ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ టాలీవుడ్ తారల్ని ప్రశంసించిన విషయం తెలిసిందే.


from https://ift.tt/2RERhov

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages