కరోనాపై పోరాటం.. సినీ కార్మికుల కోసం బ్రహ్మానందం సాయం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 10 April 2020

కరోనాపై పోరాటం.. సినీ కార్మికుల కోసం బ్రహ్మానందం సాయం

ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ 200కి పైగా దేశాల్లో విస్తరించి యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో తామూ భాగమవుతామని ముందుకొస్తున్నారు సినీ తారలు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన విరాళాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినీ రంగం విషయానికొస్తే.. సినిమా షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో సినీ కార్మికులకు పని దొరకక అల్లాడి పోతున్నారు. సినీ కార్మికులు ఎదుర్కొంటున్న ఈ దుర్భర పరిస్థితి గమనించిన సినీ పెద్దలు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ‘మనకోసం’ ఏర్పాటు చేశారు. ఈ సీసీసీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు చిరంజీవి. Also Read: మెగాస్టార్ పిలుపు మేరకు ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, లావణ్య త్రిపాఠి, బాలకృష్ణ లాంటి ఎందరో నటీనటులు సీసీసీకి తమ విరాళాలు ప్రకటించి ఉదారత చాటుకోగా.. తాజాగా కమెడియన్ బ్రహ్మానందం తన వంతుగా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సీసీసీ ద్వారా సమకూరిన సొమ్ముతో సినీ కార్మికులకు నెలవారీ సరుకులు సరఫరా చేస్తూ అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు.


from https://ift.tt/39Z60ko

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages