నెటిజన్ ట్వీట్.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 24 September 2019

నెటిజన్ ట్వీట్.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సిల మధ్య వివాదం. కంగన సోదరి రంగోలీ గతంలో తాప్సిపై చేసిన కామెంట్లు ఇప్పటికీ వేడి వేడిగానే ఉన్నాయి. మ్యాటర్ సీరియస్ అవ్వకూడదని మౌనంగా సహిస్తున్నారు. అయినా రంగోలీ నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ ఆమెను రెచ్చగొట్టారు. సర్లే అని తాప్సి మౌనం వహించారు. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ మళ్లీ వీరి మధ్య చిచ్చు పెట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాండ్ కీ ఆంఖ్’. తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ అనే ఇద్దరు మహిళా షార్ప్ షూటర్ల జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో తాప్సి, భూమి 60 ఏళ్ల బామ్మల పాత్రలను పోషించారు. అయితే ట్రైలర్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నాకు తాప్సి, భూమి పెడ్నేకర్‌ల నటన నచ్చింది. కానీ అవి బామ్మల పాత్రలు కాబట్టి నీనా గుప్తా, రమ్యకృష్ణలను ఎంపిక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు గొడవ మొదలైంది. ఈ నెటిజన్ ట్వీట్ చూసి మరో నెటిజన్ ట్వీ్ట్ చేశారు. ‘ముందు ఈ సినిమా కంగన రనౌత్‌కు దక్కింది. కానీ ఆమె మిమ్మల్ని తీసుకోవాలని దర్శకుడికి చెప్పారు’ అని. దాంతో తన సోదరి టాపిక్ వచ్చిందని వెంటనే రంగంలోకి దిగారు కంగన సోదరి రంగోలి. ‘ముందు ఈ సినిమా ఆఫర్ కంగనకు వచ్చింది. కానీ మిమ్మల్ని కానీ రమ్యకృష్ణను కానీ తీసుకోవాల్సిందిగా కంగన కోరింది. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకుల ఆలోచనలు ఇంకా మారలేదు. మిమ్మల్ని తీసుకుంటే ఎక్కడ సినిమా ఆడదోనని యువ నటీమణులకు అవకాశం ఇచ్చారు. వృద్ధుల పాత్రల్లో యువ నటీనటులను తీసుకుంటే మన భారతదేశ చిత్ర పరిశ్రమ ఇలాగే ఉంటుంది. ఫెమినిజం పేరుతో సెక్సిజంను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్‌కు సిగ్గులేదు’ అని తాప్సిపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు. దాంతో తాప్సికి ఒళ్లుమండింది. ఇంతకాలం మౌనంగా సహించిన తాప్సికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘మనం పాజిటివిటీని స్వీకరిద్దామా? లేక రిస్క్‌లు తీసుకునే ధైర్యం లేక ఎప్పుడూ నెగిటివిటీతోనే బతికేద్దామా? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి భుజాలతో పాటు వెన్నెముక కూడా లేదా? కేవలం ఇద్దరు యువతులకు (కంగన, రంగోలీ)లకు మాత్రమే ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలా? ‘సారాంశ్’ సినిమాలో అనుపమ్ ఖేర్ నటించిన పాత్ర గురించి ఎవ్వరూ ఎందుకు కామెంట్ చేయలేదు? సునీల్ దత్‌కు నర్గిస్ దత్ తల్లిగా నటించినప్పుడు ఆమెను ఎందుకు ప్రశ్నించలేదు? త్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్ ఖాన్ కాలేజ్ కుర్రాడి పాత్రలో నటించినప్పుడు ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలు, ఆరోపణలు అన్నీ మాకేనా? ఒకవేళ అదే నిజమైతే మేం చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నాలను మీరు ఈ రకంగానైనా గుర్తించినందుకు ధన్యవాదాలు. త్వరలో మీకున్న సందేహాలన్నీ తీరిపోతాయి. ఈ దీపావళికి ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమాతో పటాసులు పేల్చడానికి కాదు బుల్లెట్లు దించడానికి వస్తున్నాం’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు తాప్సి.


from https://ift.tt/2n3ktcy

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages