నాలుగేళ్లకే మిమిక్రీ.. టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్.. 400కు పైగా సినిమాలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 25 September 2019

నాలుగేళ్లకే మిమిక్రీ.. టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్.. 400కు పైగా సినిమాలు

నాలుగేళ్లకే మిమిక్రీ చేయడం మొదలుపెట్టాడు. పొట్టకూటి కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫోన్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా మిమిక్రీతో అందరినీ నవ్వించాడు. సొంత టాలెంట్‌తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దన్నర కాలంపాటు తన హవా కొనసాగించాడు. 400కు పైగా సినిమాలు. ఎన్నో వెరైటీ పాత్రలు. ఆయన చేసిన ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈరోజు తన అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. హాస్యనటుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వేణుమాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవారు. నాలుగేళ్లకే అందరినీ అనుకరిస్తూ మిమిక్రీని వంటబట్టించుకున్నారు. ఆ తరవాత పలు వేదికలపై మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు. ఆర్థికంగా బలహీనుడైన వేణు టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్‌గానూ పనిచేశారు. అయితే, ఆయనలోని హాస్యనటుడిని గుర్తించిన ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ‘సంప్రదాయం’ సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1996లో విడుదలైంది. ఆ తరవాత 1998లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రంతో వేణుమాధవ్‌కు గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ‘తమ్ముడు’, ‘ప్రియమైన నీకు’, ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’, ‘నువ్వే నువ్వే’, ‘జెమిని’, ‘దిల్’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘ఆర్య’, ‘సాంబ’, ‘గౌరి’, ‘గుడుంబా శంకర్’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘బన్నీ’, ‘లక్ష్మి’, ‘జై చిరంజీవ’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కృష్ణ’, ‘యోగి’ వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. Also Read: ‘లక్ష్మి’ సినిమాలో నటనకు గాను వేణుమాధవ్‌కు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు దక్కింది. ‘హంగామా’, ‘భూకైలాష్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో వేణు హీరోగా నటించారు. కేవలం సినిమాల్లోనూ కాకుండా ‘వన్స్ మోర్ ప్లీజ్’ వంటి టీవీ షోలలోనూ వేణుమాధవ్ మెరిశారు. ఉదయభానుతో కలిసి వేణు హోస్ట్ చేసిన ‘వన్స్ మోర్ ప్లీజ్’ కామెడీ షో అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. వేణుమాధవ్ చివరిగా ‘రుద్రమదేవి’ సినిమాలో చెప్పుకోదగిన పాత్రలో కనిపించారు. ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వేణుమాధవ్‌కు గత నాలుగేళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఆయన రాజకీయాల వైపు మళ్లారు. ఈ క్రమంలో తన సొంతూరు కోదాడ నుంచి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ పోటీలో నిలవలేకపోయారు. ఎందుకంటే ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గతకొద్ది నెలలుగా వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బయటికి ఎక్కడికీ వెళ్లకుండా కాప్రాలోని తన నివాసంలోనే ఉంటున్నారు. అయితే, ఇటీవల వేణుమాధవ్‌కు కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈనెల 6న కుటుంబ సభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతోన్న వేణు.. బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో, తెలుగు సినీ పరిశ్రమ మరో మంచి నటుడిని కోల్పోయినట్టయింది. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


from https://ift.tt/2mz5PJI

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages