Anasuya: నేను ఎవర్నో ఏం చేస్తుంటానో మీకు తెలియాలి: అనసూయ ‘కథనం’ ఇదే! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 3 August 2019

Anasuya: నేను ఎవర్నో ఏం చేస్తుంటానో మీకు తెలియాలి: అనసూయ ‘కథనం’ ఇదే!

జబర్దస్త్ కామెడీ షో అంటూ ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు విందు అందించే హాట్ యాంకర్ .. వెండితెరపైనా వెలుగులు జిమ్ముతోంది. క్షణం, రంగస్థలం, యాత్ర వంటి చిత్రాలతో నటిగా గుర్తింపుతెచ్చుకుని టాలీవుడ్‌లో బిజీగా మారింది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన ‘కథనం’ ట్రైలర్‌లో అనసూయ క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచింది. ‘మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే ముందు నేను ఎవరో.. ఏం చేస్తుంటానో మీకు తెలియాలి’ అంటూ ‘కథనం’ కథను మొదలుపెట్టింది అనసూయ. ‘ఊరంటే వంద రెండొందలు ఇళ్లు కాదు.. మట్టితో పెనవేసుకున్న తరతరాల బంధం’ అంటూ మరో వైవిధ్యపాత్రలో కనిపిస్తోంది అనసూయ. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో ‘కథనం’ ట్రైలర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అనసూయ. అయితే ‘కథనం’లో కనిపించే సన్నివేశాలు.. క్యారెక్టరైజేషన్స్.. రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూర్చగా.. స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ అందించారు. అనసూయతో పాటు.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పృధ్వీలు కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


from https://ift.tt/338AAWB

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages