ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను.. ‘ఆదిత్య 369’ చూశాను: త్రివిక్రమ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 5 August 2019

ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను.. ‘ఆదిత్య 369’ చూశాను: త్రివిక్రమ్

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘రణరంగం’ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో ఘనంగా జరిగింది. మాటల మాంత్రికుడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. హీరో , హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్‌లతోపాటు చిత్రంలోని ఇతర నటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ట్రైలర్లు చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్‌ చూడగానే అలా అనిపించింది. ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను. ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్‌ అనే వ్యక్తి ద్వారా శర్వానంద్‌ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40 ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్‌ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్‌ 40 ఏజ్‌ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ తనకు ఎప్పటి నుంచో తెలుసని, ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే పరిచయమని త్రివిక్రమ్ వెల్లడించారు. తనకు ఇష్టమైన వ్యక్తుల్లో సుధీర్ ఒకరన్నారు. ‘‘సుధీర్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. శర్వా, కళ్యాణి కెమిస్ట్రీ బాగుంది. సుధీర్‌ ప్రేమకథలూ తీయొచ్చు అని నాకు అనిపించింది. ‘ప్రస్థానం’లో చిన్న వయసులోనే బరువైన పాత్ర పోషించాడు శర్వా. ‘రణరంగం’లోనూ అలాంటి అవకాశమే వచ్చింది. ఛాయాగ్రహణం, సంగీతం బాగా కుదిరాయి. ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్‌ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది’’ అని త్రివిక్రమ్ అన్నారు. ‘రణరంగం’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్నారు.


from https://ift.tt/2KpqW9O

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages