iSmart Shankar: ‘దేవుడ్ని మొక్కొద్దు’ స్క్రిప్ట్ రెడీ చేశా: పూరీ షాకింగ్ నిర్ణయం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 22 July 2019

iSmart Shankar: ‘దేవుడ్ని మొక్కొద్దు’ స్క్రిప్ట్ రెడీ చేశా: పూరీ షాకింగ్ నిర్ణయం

ట్రెండ్ మారినా.. ఏజ్ మారినా.. ఆయన ఎంచుకునే కథల్లో రఫ్ అండ్ బోల్డ్ నెస్‌ మాత్రం పోవడం లేదు. ఊర మాస్ అంతకు మంచిన మసాలా సీన్స్‌తో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే పూరీ జగన్నాథ్ భక్తిరసచిత్రాన్ని చేస్తున్నారట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. భక్తి చిత్రం అంటే కె. రాఘవేంద్రరావు మాదిరి ‘అన్నమయ్య’ కాదు.. ఇది పూరీ మార్క్ మూవీ. దేవుడ్ని మొక్కొద్దని’ సినిమా తీస్తా. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందంటున్నారు పూరీ జగన్నాథ్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్‌లో ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో తాను భక్తి చిత్రం తీయబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేవుడ్ని మొక్కొద్దు అని సినిమా తీస్తా. స్క్రిప్ట్ కూడా రెడీ ఉంది. ఎప్పటి నుండో ఈ సినిమా తీయాలని ఉంది. దేవుడి కాళ్లపై పడి మొక్కడం లాంటివి అందరూ తీసిన సినిమానే. నేను దేవుడ్ని మొక్కడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అన్న పాయింట్‌లో కథను రాశా. నిజానికి జనం వాళ్ల ప్రాబ్లమ్స్ తీరడం కోసం దేవుడ్ని మొక్కుతారు. దేవుడి గురించి తెలుసుకోవాలని కాని.. ఆయనపై ఇంట్రస్ట్ కాని ఉండదు. దేవుడు కాళ్లపై పడిపోవాలనుకునే వారే తప్ప ఆయన్ని పలకరించే వాళ్లు లేరు. దేవుడు అనేది ఓన్లీ మనుషులకు మాత్రమే. జంతువులు మొక్కవు. ఈ గాడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రపంచ యుద్దాలకంటే.. మతఘర్షణలతో ఎక్కువ మంది చనిపోయారు. దేవుడ్ని మొక్కడం వల్ల ప్రశాంతత వస్తుందని అనుకుంటా.. కాని చాలా వయిలెంట్‌గా మారిపోతాం. నేను మనుషుల్ని నమ్ముతా.. మనిషే హెల్ప్ చేస్తాడు. దేవుడు హెల్ప్ చేయడని నమ్మే మనిషిని నేను. అయితే అప్పుడప్పుడూ ద్వేషిస్తూ ఉంటాము. అలా అని అందర్నీ ప్రేమించలేం. నన్ను ద్వేషించే వాళ్లు ఉంటారు.. ప్రేమించే వాళ్లు ఉంటారు. నా నుండి ఎంత మంది దూరం అయితే అంత బాగుంటానని నమ్ముతా. నన్ను అందరూ వదిలేసి పోతే బాగుండు అనుకుంటా. ఎవరూ లేకపోతే హ్యాపీగా బతకొచ్చు. చుట్టూ ఉన్న వాళ్లు మన పని మనల్ని చేసుకోనీయరు. ఎదిగే కొలదీ మనల్ని తొక్కడానికి చూస్తారు. మనం అడుక్కుని తింటుంటే ఎవరూ మీ వైపు చూడరు. పీక్కు తినే వాళ్లు ఎక్కువ. ఇది నా చుట్టూ ఉన్న వాళ్ల నుండి నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది ఇదే. కొన్ని కోట్లు సంపాదించిన నేను చేతిలో లక్ష రూపాయలు కూడా లేకుండా ఉండే పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్పుడూ హ్యాపీగానే ఉన్నా. కాకపోతే బాధపడ్డా. సున్నా నుండి మళ్లీ మొదలయ్యా. అలాంటి టైంలో.. నాకు తోడుగా ఉన్నది నా భార్య మాత్రమే. ఇండస్ట్రీ నుండి సపోర్ట్ రాలేదు. పూరీ ఎలా ఉన్నావు అని అడిగే వారే తప్ప హెల్ప్ చేసే వాళ్లు కనిపించలేదు. నేను హెల్ప్ చేయమని అడిగే టైప్ కాదు’ అంటూ జీవితపాఠాన్ని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.


from https://ift.tt/2O6fCEj

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages