మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 30 July 2019

మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్

సరిగ్గా ఐదేళ్ల క్రితం నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ సంస్థ టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌజుల్లో ఒకటిగా నిలిచింది. వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ ముగ్గురూ మంచి అభిరుచి కలిగిన నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, డియర్ కామ్రేడ్’’ ఇలా వరసగా అన్నీ మంచి సినిమాలే. టాలీవుడ్‌లోని టాప్ లిస్టులో ఉన్న హీరోలను ఎంపిక చేసుకుని.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. వీళ్లు చేసిన ప్రయోగాలన్నీ ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం నానితో తీసిన ‘‘గ్యాంగ్ లీడర్’’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే బహుభాషా చిత్రాన్ని కూడా మొదలుపెట్టారు. మాళవికా మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమాను తాము నిర్మిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక్కో సినిమా చేసింది. తమకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలతో మరోసారి సినిమాలు చేస్తున్నారట. మహేష్‌బాబు సినిమా 2020లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఒక చిత్రాన్ని నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారట. ఈ సినిమా కూడా 2020లో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వారివారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్‌లు పూర్తికాగానే వీరి నెక్ట్స్ ప్రాజెక్టులు మైత్రీ మూవీ మేకర్స్‌తోనే. మొత్తానికి వచ్చే ఏడాదికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. త్వరలోనే విజయ్ దేవరకొండ ‘హీరో’ షూటింగ్ ప్రారంభమైపోతుంది. బహుశా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. వచ్చే ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తారు. ఈ సినిమా దర్శకుడు ఎవరో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ‘‘RRR’’తో ఎన్టీఆర్, ‘‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’’తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తికాగానే వీరిద్దరూ జతకడతారు. మరోవైపు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్.. ఈ ప్రాజెక్టు పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారు.


from https://ift.tt/2ZkuaSb

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages