అక్క నన్ను చంపాలని చూస్తోంది.. తీవ్ర ఆరోపణలు చేసిన సాక్షి శివానంద్ చెల్లెలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 24 July 2019

అక్క నన్ను చంపాలని చూస్తోంది.. తీవ్ర ఆరోపణలు చేసిన సాక్షి శివానంద్ చెల్లెలు

తెలుగులో ఒకప్పుడు బాగా పాపులర్ హీరోయిన్ అయిన సాక్షి శివానంద్‌పై ఆమె చెల్లెలు తీవ్ర ఆరోపణలు చేశారు. టీవీ షో ‘దిల్ మిల్ గయే’తో గుర్తింపు తెచ్చుకున్న అలియాస్ ఒహన్నా శివానంద్ తన అక్క సాక్షి శివానంద్, ఆమె అత్త భావన తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు. తన అక్క అత్త తనను, తన తల్లిని చంపాలని చూస్తోందని.. ఆమెకు తన అక్క సహకరిస్తోందని చెబుతూ శిల్ప ఒక సుధీర్ఘమైన పోస్టు పెట్టింది. ‘కొన్ని నెలల క్రితం మా అక్క వాళ్ల అత్త (భావన బ్రంభత్)పై నా తల్లి హత్యాకేసు పెట్టారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె తన భర్తను చంపేయడంతో మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను, నా తల్లిని చంపడానికి ఆమె ప్రయత్నించింది. కానీ, ఆ తరవాత రోజే ఆమె అమెరికాకు పారిపోయింది. ఒకసారి ఇండియాలోని పోలీసులకు ఎదురుపడమని ఆమెను పబ్లిక్‌గా అడుగుతున్నాను. ఇక్కడి పోలీసులు మా అమ్మను చాలా సార్లు పిలిచారు. ఆమె పారిపోయిందని, వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో. కచ్చితంగా మీకు అప్‌డేట్ ఇస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి’ అని శిల్పా జూలై 18న తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌పై, అక్క సాక్షి శివానంద్‌పై ఆరోపణలు చేశారు. ‘‘మీపై రేప్ చేయించడానికి మీ బెస్ట్ ఫ్రెండే ఒకరిని పుర్మాయిస్తే మీకు ఆ విషయం తెలిసిపోతుంది. ఆ సమయంలో మీ మూడో కన్ను తెరుచుకుంటుంది. అలాగే, మీ సోదరి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని గెంటేస్తే దాని వెనుకున్న కారణం కూడా మీ మూడో కంటికి తెలుస్తుంది. మీ సోదరి అత్తమ్మ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినా, మీ తల్లి మీ ఆస్తులను చేజిక్కుంచుకోవాలని చూసినా.. ఆ విషయాలను మీ మూడో కన్ను ద్వారా పసిగట్టొచ్చు’’ అని ఆ పోస్ట్‌లో శిల్ప పేర్కొన్నారు. అంటే, తన అక్క తనను ఇంట్లో నుంచి వెల్లగొట్టడం వెనుక తనను హత్యచేయాలనే కుట్ర దాగి ఉందని పరోక్షంగా శిల్ప చెప్పుకొచ్చారు. మొత్తం మీద శిల్పా ఆనంద్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇంకా సాక్షి శివానంద్ స్పందించలేదు. కాగా, సాక్షి శివానంద్ తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించేశారు. ‘మాస్టర్, కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్ధారకుడు, యువరాజు, సింహరాశి’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. శిల్పా ఆనంద్ కూడా తెలుగులో ఒక సినిమా చేశారు. మంచు విష్ణు హీరోగా పరిచయమైన ‘విష్ణు’ సినిమాలో శిల్పా ఆనంద్ హీరోయిన్.


from https://ift.tt/2M5v3KB

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages