మూడు భాగాలుగా 3డి ‘రామాయణం’.. అల్లు అరవింద్ సంచలనం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 8 July 2019

మూడు భాగాలుగా 3డి ‘రామాయణం’.. అల్లు అరవింద్ సంచలనం

ఇతిహాస గాథ ‘రామాయణం’పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాస్తవానికి సినిమాల ద్వారా రామాయణం గురించి తెలుసుకున్నవారే ఎక్కువ. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు మొదలుకొని శోభన్‌బాబు, బాలకృష్ణ, సుమన్, జూనియర్ ఎన్టీఆర్ వరకు రాముడి పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు మనం రామాయణాన్ని బ్లాక్ అండ్ వైట్, కలర్‌లో చూశాం. ఇప్పుడు 3డిలో చూడబోతున్నాం. వాస్తవానికి రామాయణాన్ని ఎన్ని సార్లు చూసినా తనివితీరదు. రామాయణం మహాకావ్యంలోని ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా అది కూడా 3డి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాత సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. తొలి భాగం 2021లో విడుదలవుతుంది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే.. తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమలకు చెందిన ప్రముఖ నటీనటులు దీనిలో నటిస్తారని తెలుస్తోంది. మూడు భాషల్లో బాగా పేరుమోసిన నటీనటులనే ఎంపిక చేసుకుంటారట. మొత్తానికి అల్లు అరవింద్ భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనానికి తెర తీశారు. ఇండియన్ సినిమాలో ఇదే భారీ ప్రాజెక్ట్ కానుంది. ఇప్పటి వరకు రామాయణం సినిమా ఒక్క భాగంగానే వచ్చింది. కానీ, ఇప్పుడు మూడు భాగాలు. అంటే, రామాయణ గాథను చాలా స్పష్టంగా లోతుగా చెప్పనున్నారని అర్థమవుతోంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్.


from https://ift.tt/2YBMJRu

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages