S. P. Balasubrahmanyam: ఎస్పీ బాలు సంకల్పం గొప్పది.. ఆయన విజయం వెనుక ఎవరున్నారంటే! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 25 September 2020

S. P. Balasubrahmanyam: ఎస్పీ బాలు సంకల్పం గొప్పది.. ఆయన విజయం వెనుక ఎవరున్నారంటే!

గాన గాంధర్వుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడి ఆయన తుదిశ్వాస విడిచారు. లెజెండరీ సింగర్ మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యావత్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దఎత్తున సెలబ్రిటీలు మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ బాలు గొప్పతనం, ఆయన విజయాల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు ప్రముఖ జర్నలిస్ట్, డైరెక్టర్ ఇమంది రామారావు. ఆయన మాట్లాడుతూ.. ''అక్షరాన్ని తేనెలో ముంచి తీసినట్లుగా బాలు గారి గాత్రం ఉంటుంది. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్నలో 'అహో ఏమి వింత మహో' అని శోభన్ బాబుపై చిత్రీకరించిన పాటతో ఆయన కెరీర్ ఆరంభమైంది. కోందండపాణి గారి మానస పుత్రుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. ఆ ఇద్దరి బంధం చాలా గొప్పది, మాటల్లో చెప్పలేనిది. Also Read: బాలు గారు మంచి సమయస్ఫూర్తి ఉన్న మనిషి. సూక్ష్మగ్రాహి. ఆయన తన జీవితంలో ఒడిదొడుకులకు తావివ్వలేదు. తన దగ్గర పనిచేసే వాళ్లంతా బంధువుల్లా ఫీల్ అయ్యారు తప్ప పని వాళ్ళుగా ఫీల్ కాకపోయేవారు. అలా చూసుకునేవారాయన. పెళ్లి విషయంలో కొంత ఇబ్బంది పడ్డారు కానీ.. పేదరికంతో గానీ, అవకాశాలు రాలేదని గానీ ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు. ఒక్కో రోజు 10 పాటలు కూడా పాడేవారు. ఆ వైభవం చలన చిత్ర రంగంలో ఇంకెవరూ చూసి ఉండరు. ప్రతి ఆలయంలో ఆయన పాటలే వినిపిస్తాయి. భక్తి పారవశ్యంతో ఆయన పాడిన పాటలు చిరకాలం నిలిచిపోతాయి. బాలు గారు పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరన్న సందర్భంలోనే బాలు గారు డబ్బింగ్ చెప్పారు. బాలు గారు, కె. విశ్వనాథ్ గారు ఒకరినొకరు ఆరాధించుకునే వారు. వీరిద్దరికీ మంచి బాండింగ్ ఉంది. పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో బాలు గారి జన్మ ధన్యమైంది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలతో అద్భుతంగా పాటలు పాడించి కొన్ని వేలమంది శిష్యులను తయారు చేసుకున్నారు. దేశవిదేశాల్లో ఆయన శిష్యులున్నారు. అలా ఇంకో 100 సంవత్సరాలు బాలు గారి పేరు ఉండిపోతుంది. అక్షరాలు రానివారితో అష్టావధానం చేయించిన గొప్ప మనిషి బాలు గారు. ఆ సంగీత సరస్వతే స్వయంగా బాట గారి చేత పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలు చేయించింది. ఎవ్వరికైనా సరే.. చేద్దామంటే సాధ్యపడే విషయం కాదు ఇంతమంది శిష్యులను సంపాదించుకోవడం. ఈ రోజున దేశ విదేశాల్లో బాలుగారు తయారు చేసిన బిడ్డలే ఉన్నారు. వాళ్లంతా సగర్వంగా చెప్పుకుంటారు మేము బాలు గారి శిష్యులమని. మన తెలుగు సంగీత ప్రభను విదేశాల్లో చాటిన గొప్ప ప్రతిభావంతులు బాలు గారు. సంగీత సరస్వతి తన దాహాన్ని తీర్చుకోవడానికి బాలు గారిని ఒక సూత్రదారిగా ఎంపిక చేసుకుంది. సంగీతాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపించజేస్తూ.. పేద, ధనిక బేధం లేకుండా ప్రతిఒక్కరూ సంగీతం నేర్చుకోవాలని తపన పడేవారు. ఆయన సంకల్పం గొప్పది. నేర్చుకుందామనే కోరిక ఉంటే ఇదిగో నేనున్నాను అంటూ కల్పవృక్షంలా నిలబడ్డారు బాలు గారు. ఈయనకు ఈనాడు రామోజీరావు గారు అండగా నిలిచి ఆ ప్రాంగణంలో కొన్ని వేల పాటలు పాడించారు. ఈ విషయంలో బాలు గారి సక్సెస్ వెనుక రామోజీరావు గారు ఉన్నారు'' అని తెలిపారు ఇమంది రామారావు.


from https://ift.tt/3091EoR

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages