Mohan Babu: బాలు దగ్గర అప్పు తీసుకున్నా.. ఆయన మరణం నన్నెంతో బాధించింది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Friday, 25 September 2020

demo-image

Mohan Babu: బాలు దగ్గర అప్పు తీసుకున్నా.. ఆయన మరణం నన్నెంతో బాధించింది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

Responsive Ads Here
photo-78314176
లెజెండరీ సింగర్ యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. ఘంటసాల లేనిలోటు భర్తీ చేస్తూ తెలుగువారిని ఓలలాడించిన గానామృతం మూగబోవడంతో సినీ వర్గాల్లో విషాదం అలుముకుంది. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎమోషనల్ అవుతూ బాలుతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. Also Read: తనకు అత్యంత ఆప్తమిత్రుడు బాలు గారని, ఆయన మరణం తనను ఎంతో బాధించిందంటూ ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు. తామిద్దరం కలిసి శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు చదువుకున్నామని, అప్పటి నుంచే మంచి స్నేహితులమని అన్నారు. కాలక్రమంలో ఇద్దరం సినీ రంగంలో అడుగుపెట్టి ఆయన గాయకుడిగా, తాను నటుడిగా స్థిరపడ్డామని చెప్పారు. ఆయనను బాలు అని తాను పిలిస్తే, ఆయన మాత్రం తనను శిశుపాల, భక్త అనే వారని తెలిపారు. Also Read: శ్రీ విద్యానికేతన్‌లో జరిగే ప్రతి కార్యక్రమానికి బాలు గారు వచ్చేవారని, గత మార్చి 19వ తేదీన తన పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవానికి కూడా ఆయన హాజరు కావాల్సింది కానీ కరోనా కారణంగా ఆ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో రాలేదని చెప్పారు మోహన్ బాబు. బాలు గారు ఎప్పుడూ తనతో ఫోన్‌లో మాట్లాడేవారని.. చాలా ఏళ్ల క్రితం ఆయన దగ్గర అప్పు తీసుకున్న 100 రూపాయలు గుర్తు చేస్తూ సరదాగా మాట్లాడేవారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మోహన్ బాబు. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు, అన్ని దేవుళ్ళ పాటలు పాడిన గాన గంధర్వుడిని కోల్పోవడం యావత్ సినిమా ఇండస్ట్రీకే కాదు.. దేశానికే ఎంతో బాధాకరం అని మోహన్ బాబు అన్నారు. తన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారని, తన చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందని.. అలాగే తన హృదయంలో ఆయన ఎప్పుడూ ఉంటారంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. Also Read: కరోనాతో పోరాడి గెలిచి ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టడంతో బాలు మృతిచెందారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారని చరణ్ పేర్కొన్నారు.


from https://ift.tt/33Z0RIf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages