బాలయ్యను ఢీకొట్టేది ఎన్టీఆర్ కాదు.. రానా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 2 April 2020

బాలయ్యను ఢీకొట్టేది ఎన్టీఆర్ కాదు.. రానా!

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం కొత్త విషయమేమీ కాదు. తమిళం, మలయాళంలో హిట్టయిన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. అయితే, ఈ ఏడాది మాలీవుడ్‌లో విడుదలై విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొషియం’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బిజు మీనన్‌, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, మరో పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నారనే రూమర్ వినిపించింది. కానీ, ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారన్నది తాజా వార్త. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇదేనని సమాచారం. బి.గోపాల్‌తో పనిచేయడానికి ఒక మంచి కథ కోసం చూస్తోన్న బాలయ్య.. ‘అయ్యప్పనుమ్ కొషియం’ సినిమాను ఆయనకు సూచించారట. బి.గోపాల్ కూడా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ముందుకు వచ్చారని ఇండస్ట్రీ టాక్. మలయాళ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ హవల్దార్‌ అయ్యప్పన్ నాయర్‌గా పృథ్వీరాజ్ నటించారు. బిజు మీనన్ పోలీస్ ఆఫీసర్ కొషీ కురియన్ పాత్ర పోషించారు. పృథ్వీరాజ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ పాత్రలో నటించడానికి బాలకృష్ణ ఆసక్తి కనబరిచారట. ఇక, పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం రానాను సంప్రదించగా ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. Also Read: ఇదే సినిమాను తమిళంలోనూ రీమేక్ చేస్తున్నారు. అక్కడ శశికుమార్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఎవరు ఏ పాత్ర చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. నిర్మాత కతిరేసన్ తమి రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. కాగా, బాగా ఇగో కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆసక్తికర పోరాటమే ఈ సినిమా. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడులైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.30 కోట్టు వసూలు చేసింది.


from https://ift.tt/2USO8Cx

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages